సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను శనివారం జిల్లా ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి నివేదిత ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య సేవల తని కీలో భాగం గా ఈరోజు జిల్లా ఆర్.బీ.ఎస్.కె. అధికారిని డాక్టర్ నివేదిత మండల పరిధి లోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల మరియూ శ్రీరాముల కొత్త పల్లి కేంద్రములను క్షేత్ర స్థాయి లో ఆకస్మిత తనికీ చేసి టీకాల కార్యక్రమము తో పాటు వివిధ ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. తరువాత ప్రాథమిక ఆరోగ్యకేంద్రమును సందర్శించి వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ ను వివిధ కార్యక్రమాల అమలు , సిబ్బంది పనితీరు, ప్రగతి మొదలైన పలు అంశాల గురించి అడిగి తెలుసు కొన్నారు. మందుల నిల్వ, కాన్పుల గది, నమూనా పరీక్షల గది తదితరములను,సంబంధిత రికార్డ్స్ లను పరిశీలించి పలు సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా వైద్యశాల సమస్యలను గురించి వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ నాయక్ తో అడిగి తెలుసుకున్నారు.అంతకమునుపు మండలంలోని శ్రీరాముల కొత్తపల్లి, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల తో పాటు ఓడి చెరువు బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి ఇమ్యూనేజికేషన్ ప్రక్రియని పరిశీలించారు. ఆమెతోపాటు వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ నాయక్ సిహెచ్ఓ సుభాషిని.. పిహెచ్ఎన్. దిల్షాద్,సూపర్ వైజర్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin