సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ సమావేశంలో ప్రత్తిపాటి విజయ్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఈ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానని చెప్పి పది సంవత్సరాలు అవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల టైంలో పదం గడుపు తుందని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు గాని డబల్ బెడ్రూం గానీ ఇవ్వకుండా గత తొమ్మిది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఈ నెల 23న నియోజకవర్గం లోని ఎమ్మెల్యేల శానంపూడి సైదిరెడ్డి ముట్టడిస్తామని అదేవిధంగా 25న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్గవర్యులు జి కిషన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల 23న హుజూర్ నగర్ లోని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇంటి రవి పట్టణ కార్యదర్శి కల్లోజు నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin