సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండల పరిధిలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ కమిటీ తన ఉదారతను చాటుకుంది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోని డిజిటల్ క్లాసుల బోధనకు అవసరమైన, ప్రొజెక్టర్ ను అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు 30 వేల రూపాయల ఖర్చుతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ తెలిపింది. గతంలో విద్యార్థులకు ప్రైవేటు ట్యూషన్, క్లాస్ రూమ్ బెంచిల బహుకరణ, స్టడీ మెటీరియల్ తదితర సహకారం అందించారు. కొందరు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో పాఠశాల ప్రాంగణంలో కళావేదికను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఈ మధ్యకాలంలో రైల్వే,పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన కుటుంబాలను సన్మానించారు. గ్రామానికి చెందిన వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు కొంతకాలం క్రితం అభ్యుదయ కమిటీగా ఏర్పడ్డారు. దసరా, సంక్రాంతి పండుగలకు బతుకమ్మ ఉత్సవాలు, ల్ముగ్గుల పోటీలను కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ బహుమతులు ప్రధానం చేస్తున్నారు. అంతేకాదు గ్రామంలో గత ఎన్నికల సమయంలో నోటుకు ఓటును అమ్ముకోకూడదు అని ప్లకార్డులు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ప్రదర్శననిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వివరిస్తూ గ్రామంలోని, ప్రజలకు నిరక్షరాశులకు అవగాహన కల్పించారు. ప్రజాసేవకు ప్రాధాన్యతనిచ్చే మంచి వ్యక్తులను ఓటు అనే ఆయుధం ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. తమ కమిటీ అభ్యుదయంగా ఉంటూ గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, చైతన్యవంతమైన గ్రామంగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీని గ్రామస్తులు అభినందించారు.
-----------------------
Admin