సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచెర్ల మండల గ్రామాలలో ఖాళీ అవుతున్న ప్రతిపక్షాల క్యాడర్ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో నేరేడుచర్ల మండలం పార్టీ అధ్యక్షులు హరిబండి సురేష్ బాబు ఆధ్వర్యంలో వాసుకుల సుదర్శన్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కుటుంబాలు హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బి అర్ ఎస్ లోకి జాయిన్ అయినారు ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయినవారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మరియు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి శాసనసభ్యులు కార్యకర్తలను కలుపుకుపోయే విధానం చూసి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి విధానాన్ని చూసి తామంతా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయించుకొని స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని నేటి నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న సైనికుల్లాగా పని చేస్తామని సందర్భంగా వారందరూ తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన వారందరికీ బి అర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరూ కలిసికట్టుగా పని చేసి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ లోనే మొదటి స్థానంలో నిలుపుదామని అభివృద్ధి - సంక్షేమమే ప్రధాన ఏజండా గా కలిసి మెలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin