సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ బ్రష్టుపట్టిస్తున్నడని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ విమర్శించారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాలు విద్యారంగానికి 15 శాతానికి పైగా నిధులు కేటాయిస్తుంటే రాష్ట్రంలో మాత్రం కేవలం 6 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తూ బహుజన బిడ్డలకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.మన ఊరు-మన బడి గురించి గొప్పలు చెప్పుకుంటూ మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్నారు.రాష్ట్రస్థాయిలో విద్యకు బడ్జెట్ లో 20 శాతం కేటాయింపులు ఉండాలని కోఠారి కమిషన్ సూచిస్తే 9ఏండ్లుగా బడ్జెట్లో కేవలం 6 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తున్నారని,9ఏండ్లలో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని,పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,ప్రభుత్వ విద్యను పరిరక్షించి,ప్రైవేటు విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,వంగా రవిశంకర్,జర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin