సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ : ఏఐసీసీ ఓబీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఓబీసీ నేతలు గాంధీ భవన్ లో సమావేశం అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ డిక్లరేషన్, రాయపూర్ తీర్మానాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో 2 అసెంబ్లీ సీట్ల చొప్పున 34 సీట్లు కేటాయించాలని తీర్మానం చేశారు. బీసీల పట్ల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లీకార్జున ఖర్గే లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చేస్తు తెలంగాణ ఓబీసీల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మధుయాష్కి గౌడ్, ఓబీసీ డిక్లరేషన్ చైర్మన్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంత్ రావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపి సురేష్ షట్కర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సభ్యులు, ఓబీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు నాగా సీతారాములు, మరియు ఓబీసీ డిక్లరేషన్ సభ్యులు, ఓబీసీ అసెంబ్లీ టికెట్ ఆశావాహులు పాల్గొన్నారు.
-----------------------
Admin