సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైకు ను ఢీ కొట్టిన టాటా ఏసీ వాహనం, ప్రమాదంలో స్పాట్లో మృతి చెంది వ్యక్తి పేరు సత్తారపు వీరయ్య వయస్సు 50 సంవత్సరాలు ఎస్సీ మాదిగ. అదే బైక్ పై ఎక్కిన వ్యక్తి వరదాపురం గ్రామానికి చెందిన రెడపంగు రాజరత్నం భార్య చంద్రకళ. ఆమెకు బలమైన గాయాలు అయినట్లు సమాచారం. ఆమెను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. ప్రమాదంలో మరణించిన సత్తారపు వీరయ్యను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.ఎస్సై బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
-----------------------
Admin