సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు పట్టించుకోని మా సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్రం నుండి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ మంజూరు చేయించడం జరిగింది, మా గ్రామానికి అంగన్వాడి స్కూలు, స్కూల్ కల్పించాలని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ RC.No.CL14/BV/NCLP/KMM/013-014 నుంచి డిఈఓ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా జిల్లా కలెక్టర్ స్పందించి పక్కా ఇళ్లు, బిటి రోడ్లు, కరెంట్, మంచినీటి సరఫరా, డ్రైనేజీలు మంజూరు చేయాలని జిల్లా పంచాయితీ అధికారి కి లేఖ రాయడం జరిగింది. సంబంధిత అధికారులకు లేఖ రాసి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదని వర్షాలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఓట్లు తీసుకుంటున్నారు తప్ప మమల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం ఒక్కసారి మేము వెళ్లి మద్దిశెట్టి సామెలు కి కలవడం వల్ల ఆయన మా బాధను స్పందించి ఢిల్లీ నుంచి మాకు ఆర్డర్స్ తీసుకొచ్చిన అందుకే మద్దిశెట్టి సామెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము. కావాలని మా వలస ఆదివాసీలలో కొంతమందిని అమాయకుల్ని ఏరి స్వార్థపరులైన రాజకీయ నాయకులు ఆయన ఎదుగుదల ఓర్వా లేక కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో తప్పుడు కేసులు పెడుతున్నారు. న్యాయస్థానం కూడా మా నాయకుడు కి ఎటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా మద్దిశెట్టి సామేలు తరఫున ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు న్యాయస్థానానికి మద్దిశెట్టి సామిల్ కి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము... ఈ కార్యక్రమంలో BSSM రాష్ట్ర కార్యదర్శి ఇస్రం శ్రీనివాస్ రావు BSSM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే వి ఆర్ మూర్తి సుధాకర్ గార్లపాటి రాజీవ్ నగర్ కాలనీ ఉప్పసాక పంచాయితీ గ్రామస్తులు పాల్గొన్నారు...
-----------------------
Admin