సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మఠం పల్లి : ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించకపోతే బిజెపితో యుద్ధమేనని మఠం పల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దేవపంగు బాబు అన్నారు. రిలే నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరింది.మఠం పల్లి మండల కేంద్రంలోని తాహాసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలో మాట్లాడారు. దీక్షకు సిపిఐ మండల కార్యదర్శి ఏ. పున్నయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి అధ్యక్షులు కష్టాల వెంకటేశ్వర్లు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి నగేష్ మాదిగ, అధికార ప్రతినిధి పగిడిమర్రి బాబు మాదిగ, పెద్దలు సీనియర్ నాయకులు రాయల్, చిలక దేవా బిక్షం, దేవ పంగు ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు, కుక్కల పెద్ద సైదులు మాదిగ కొమ్ము నాగరాజు మాదిగ, రావూరి ఏసు దాసు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin