సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో మేళ్లచెరువు సర్పంచ్ శంకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బసవయ్య మేళ్లచెరువు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో మేళ్లచెరువు లోని కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని వడ్డెర విశ్వబ్రాహ్మణ కమ్మ కులాల కుటుంబాలు నేడు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఆయన నాయకులు స్పందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మరియు సామాజికంగా గ్రామాలలో ఎటువంటి మార్పును చూడలేకపోయామని... కానీ నేడు హుజూర్ నగర్ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్ నగర్ నియోజకవర్గ మొత్తం త్వరిత గతిన అభివృద్ధి చెందుతుందని అందులో మేళ్లచెరువును చారిత్రాత్మకంగా తెలంగాణ లోనే ఒక ఐకాన్ గా తీర్చిదిద్దారని ఈ మూడు సంవత్సరాలలో మేళ్లచెరువు మండలం 30 సంవత్సరాల ముందుకు వెళ్లిందని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు చారిత్రాత్మక శివాలయం గణనీయంగా అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలోనే మేళ్లచెరువు యొక్క పేరుని ప్రభంజనం చేశారని మరియు పార్టీలోని అందరూ కార్యకర్తలను నాయకులను కలుపుకొని పోతూ అందరికి విలువను గౌరవాన్ని ఇస్తూ అందరిని గుర్తిస్తూ పేరుపేరునా పలకరిస్తూ ప్రతి ఇంటికి మంచి చెడుకు వచ్చి తానున్నానంటూ ఆయా కుటుంబాలకు భరోసానిస్తున్నటువంటి శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి యొక్క నాయకత్వంలో పనిచేయాలని కలలు కన్నామని నేడు ఆ కల సహకారం అయిందని నేడు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చేతులమీదుగా పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలో కి ఆహ్వానించడం తో సంతోషంగా ఉన్నామని సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉన్నామని ఇన్నాళ్లు చీకట్లో నుంచి మగ్గిపోయామని ఈరోజు వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నామని నేటి నుంచి అంకితభావంతో సైదన్న సైనికులుగా పనిచేస్తామని టిఆర్ఎస్ పార్టీలో అంకితభావంతో మరియు నిజాయితీతో అభివృద్ధిలో పాల్పంచుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin