సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణ,మండల మున్నూరు కాపు, అనుబంధ కులాల కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని 20వ తేదీ ఆదివారం నాడు స్థానిక ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం నందు నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు స్థానిక ఆడమ్స్ కాలేజీ నందు కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్, చింత నాగరాజు, నూకల రంగారావు లు పాల్వంచ పట్టణ,మండల మున్నూరు కాపు, అనుబంద కులాల కార్తీకమాస వనభోజనాలను స్థానిక కిన్నెరసాని రోడ్ లోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం నందు ఏర్పాటు చేశామని ఈ యొక్క కార్యక్రమానికి పాల్వంచ పట్టణ మండల పరిధిలోని సుమారు 5000 మందికి పైగా హాజరు కానున్నారని వారందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని, ఈయొక్క వనభోజన కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి డూప్ కళాకారులతో ప్రదర్శనలు, మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలు, అతిధులకు సన్మానాలు లాంటి కార్యక్రమాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ, మండల మున్నూరు కాపు అనుబంధకులాల సోదర, సోదరీమణులందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యలు మిర్యాల కమలాకర్, ఆకుల ఆనంద్, మద్దుల వీర మోహన్ రావు, బేతంశెట్టి విజయ్, సమ్మెట అప్పారావు, గోవాడ రవి, మేడిశెట్టి సాంబశివరావు, తోట ప్రవీణ్ పటేల్, బాలినేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin