సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మరియు ఇల్లందు శాసనసభ్యులు బానోత్ హరిప్రియ నాయక్ విచ్చేశారు. వారికి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మహమూద్ పాషా, యాకూబ్ పాషా ఘనంగా స్వాగతం పలికారు. వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, హరిప్రియ నాయక్ హాస్పిటల్ ని ప్రారంభించారు. శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు హాస్పిటల్ ని డాక్టర్ నీ ఉద్దేశించి మాట్లాడారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ కొత్తగూడెం ప్రజానీకానికి తాను మెరుగైన వైద్యం చేస్తానని పేదలకు అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ సర్వీస్ ఉంటుందని, తాము సేవ భావంతో ఈ హాస్పిటల్ ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు రాజకీయవేత్తలు మరియు డాక్టర్ స్నేహ బృందం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు.
-----------------------
Admin