Friday, 31 July 2026 07:48:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యుత్ ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలి...

Date : 02 February 2023 11:30 PM Views : 867

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా లో విద్యుత్ ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా లోని స్థానిక డీఈ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ 2023 నుంచి క్యాటగిరి-1 మీటర్లకు గతంలో లేనివిధంగా అదనంగా ఏసీడీ చార్జీలను వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వం అధిక భారాన్ని మోపుతోందన్నారు. రాష్ట్రంలో తిరిగి దీపాలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం అదనపు ఛార్జీలతో సామన్యుల నడ్డి విరస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఏసీడీ చార్జీలను ఉన్న ఫలంగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, నాయకులు బొడపట్ల రవీందర్, మచ్చామణి, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, మల్లంపాటి ప్రసాదరావు, పాపగంటి రాంబాబు, ఓర్సు సీతారాములు, తోట కృష్ణవేణి, యనమద్ది రామకృష్ణ, వడ్లమూడి మధు, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, పల్లెబోయిన కృష్ణ, ఇమ్మడి సుధీర్, కిన్నెర మోతి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :