సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సూర్యాపేట జిల్లా బీసీ నాయుడు వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్ అమరవీరుల స్థూపం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ బలహీన వర్గాల వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదా? టికెట్ అడిగితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తారా? అంటూ ప్రశ్నించారు.మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు నమోదు చేశారని,బీసీ నేత ప్రజాబలంతో రాజకీయంగా ఎదుగుతుంటే అగ్రవర్ణ నాయకులు అణగదొక్కలని చూస్తున్నారని ఆరోపించారు.ఇన్ని రోజులు లేనిది ఒక్కరోజులోనే 72 కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.50 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి బీసీల పట్ల కేసీఆర్ కు ఉన్న చులకన భావన్ని బయట పెట్టాడని విమర్శించారు.90 శాతానికి పైగా ఉన్న బహుజనులు అందరూ ఏకమై రాబోయే ఎన్నికల్లో అగ్రవర్ణ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.జానయ్యకు ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆయనకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,అసెంబ్లీ చేరికల కమిటీ చైర్మన్ గుడివాడ రాజేందర్,నీలా,దీపికా తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin