సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ : సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ఆదేశానుసారం హుజూర్నగర్ పట్టణంలో ఇంటింటి కి బిజెపి కార్యక్రమంలో భాగంగా అల్పకాలిక విస్తారక్ గొటిక.శివకృష్ణారెడ్డి ఈరోజు హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఇంటి.రవి,పోలింగ్ బూత్ నెంబర్లు 221,222 మరియు 224 ల శక్తి కేంద్రం ఇంచార్జ్ గుండా.గోపి,బూత్ అధ్యక్షులు ఎల్లయ్య,వంశీ,బూత్ ప్రధాన కార్యదర్శి పులి నరసింహారావు కొండా హరీష్ లతో కలిసి సమావేశం నిర్వహించి సీనియర్ కార్యకర్త కొండ హరీష్ ఇంట్లో అల్పహారం చేసారు. అనంతరం సరల్,నమో యాప్ లలో వివరాలు నమోదు పరిచి ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల సేవ,సుపరిపాలన,పేదల సంక్షేమం ప్రచారానికి సంబంధించిన కరపత్రాలను పంచడం ద్వారా ప్రజలకు గడిచిన 9 ఏళ్లలో దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశానికి తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అవకాశం కల్పించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin