Saturday, 13 June 2026 11:33:52 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఆడపిల్లలను పుట్టనిద్దాం... బ్రతకనిద్దాం ఎదగనిద్దాం... ఆడపిల్లలను చదివిద్దాం... - ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్

Date : 25 January 2024 09:25 AM Views : 310

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ , మరియు ఎం.ఈ.ఓ ఛత్రు నాయక్, ఎంపీడీవో జానకి రాములుతో కలిసి జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 24 వ తారీఖున జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం ప్రధానంగా దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలపై మాట్లాడటం, ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, బాలిక విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ప్రాముఖ్యత గురించి చర్చించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లాంటి ప్రధాన లక్ష్యాలుగా జాతీయ బాలిక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలిక దినోత్సవం జనవరి 24 2008న జరుపుకున్నారు. జనవరి 24 1966న ఇందిరాగాంధీ భారత దేశ తొలి మహిళా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. దీనికి చిహ్నంగానే మహిళా సాధికారత లింగ సమానత్వాన్ని ప్రో జాతీయ బాలిక దినోత్సవం మహిళా- శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లింగ అసమానతతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాలను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగు ఆ తర్వాత క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి ఇమేజ్ సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా 2015లో బేటి బచావో, బేటి పడావో అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.నేటి బాలికల కళ ఏమిటంటే?...ప్రతి అమ్మాయికి ఆమె నేపథ్యం లేదా పరిస్థితి తో సంబంధం లేకుండా ,ఆరోగ్య సంరక్షణ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు ఉండాలి. బాలికలకు సాధికారత కల్పించాలి. తద్వారా సమాజానికి ఎంతో మేలు ఈ ఆశయంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక సంస్థలు ,జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటారు .సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా హాయిగా ఎదిగే అవకాశాలు ,ఎలాంటి హింస, వివక్ష వేధింపులు లేని సమాజమే నేటి ఆడపిల్లల కల. ఈ కళ పండే రోజు త్వరలోనే రావాలని ,ఆశల రెక్కలు విప్పుకొని ,మన ఆడబిడ్డలు హాయిగా ఎగరాలని అందరం కోరుకుందాం. మహిళలకు అవకాశాలు ఇవ్వాలేగాని కుటుంబం, సమాజం, సంస్థల్ని , చివరికి దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ఆడపిల్లల్ని పుట్టనిద్దాం ,బతకనిద్దాం ,ఎదగనిద్దాం, చదవనిద్దాం!! ఇదే ప్రతి పౌరుడిని పౌరుడిని నినాదం కావాలి. మన జీవితాలకు అర్థం.. పరమార్థం.. శాంతి.. శ్రేయస్సు తోపాటు ఎనలేని ప్రేమను అందించే బంగారు తల్లులు మన ఆడబిడ్డలు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంజుల, డాక్టర్లు సుధాకర్, నాగేందర్, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :