Thursday, 30 July 2026 07:54:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి చేయాలి............ - జాయింట్ కలెక్టర్ చేతన్

Date : 19 October 2022 11:13 PM Views : 367

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు, బెంగళూరు - మైదుకూరు - అమరావతి- విజయవాడ ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై ఆర్డీఓలు, తహసీల్దార్ లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న వివిధ జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ చాలా ప్రధాన అంశమన్నారు. అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయా ప్రాజెక్ట్లకు సంబంధించి సకాలంలో భూసేకరణను చేపట్టాలని, ఇందుకోసం ఆయా శాఖల అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే, కొడికొండ చెక్ పోస్టు - హిందూపురం 544 రహదారి, ఎన్ హెచ్ 44, ఇతర రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ప్రాజెక్టును సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజులలోగా 3జీ, అలాగే నేషనల్ హైవే 342 పనులను పూర్తి చేసి సంబంధించిన ప్రతిపాదనలను మూడు నాలుగు రోజుల్లోగా సమర్పించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కే.కార్తీక్ , పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో తిప్పే నాయక్, కదిరి ఆర్డిఓ రాఘవేంద్ర, ఎక్స్ప్రెస్ హైవే ఏఈ రామకృష్ణ, ఎన్ హెచ్ హైవే ఏఈ గిడ్డయ్య, ఆయా మండలాల తహసీల్దార్ లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: