సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మైనార్టీలకు మంజూరైన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చి ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ముస్లింలు విద్య పరంగా సామాజిక ఆత్మగౌరవంతో బతికే విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ముస్లిం పిల్లలు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య చదివేందుకు మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి వసతి తో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఇండ్లకే పరిమితమైన ముస్లిం ఆడపిల్లలు నేడు ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు.మైనార్టీ ల విదేశీ విద్య కోసం ఆర్ధిక సహాయం అందజేస్తామన్నారు. చదువు సంధ్యలకు దూరమై పలు వృత్తుల్లో ఉన్న ముస్లిం యువకులు నేడు ఉన్నత విద్యల అభ్యసిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఉపాధికి అనేక పథకాలను అమలు చేస్తూ వారి జీవన పరిస్థితుల్లో మార్పులు తెచ్చామన్నారు సంక్షేమం కోసం మసీదుల నిర్మాణానికి షాదీ ఖానాల నిర్మానానికి,ఖబరాస్తా న్ ల నిర్మాణానికి వేల రూపాయల బడ్జెట్ మంజూరు చేశారన్నారు. మసీదుల్లో మౌజన్ లకు,ఇమామ్లకు గౌర వేతనం ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు.రంజన్ పండుగ పేద వాళ్ళు సంతోషం గా చేసుకోడానికి దుస్తులు, ఇఫ్తార్ విందులు ఏర్పటు చేశామన్నారు.మైనార్టీలకు లక్షరు.లు మైనార్టీ బంధు ప్రకటించి వారి కి జీవనోపాధి కల్పిస్తున్నమన్నారు.మైనారిటీ లకు తాను అండగా ఉంటామన్నారు.
-----------------------
Admin