సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్ మరియు కళాశాల యజమాన్యం చాలా అవకతవకలకు పాలు పడ్డారని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యం దృష్టికి వచ్చింది. అయితే మన శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బి.కె పార్థసారథి దృష్టికి తీసుకెళ్లి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది.... జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్ విద్యార్థుల నుండి యూనిఫార్మ్స్ మరియు ఐడి కార్డులు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరిగింది.కానీ అవి నాణ్యత లేక పోవడం మరియు అందులో కమిషన్లు ఆశించడం జరిగింది. కళాశాల మెయింటెనెన్స్ కు సంబంధించి సీసీ కెమెరాలు అయితేనేమి, త్రాగునీరు సంబంధించి, UPS పవర్ సప్లై మరియు పాత పేపర్ల అమ్మకం ఇలా ఎన్నో అడ్డదారిన కళాశాల సొమ్మును దుర్వినియోగం చేయడం జరిగింది. టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి విన్నవించడం ఏమిటంటే ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న బషీర్ అహ్మద్ ని తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపాల్ ని నియమించాలని కోరడం జరిగింది.మరియు ఆయన పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది....
-----------------------
Admin