సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రేవంతే కాదు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడైనని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేవంత్ చంద్రబాబు శిష్యుడు అంటూ టిఆర్ఎస్ నాయకులు వ్యంగంగా మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీలో ఉన్న 90 శాతం మంది కూడా చంద్రబాబు నాయుడు శిష్యులేనన్న విషయాన్ని బిఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ని విమర్శించి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. నాడు తెలంగాణ వాదంతో తెలుగుదేశం పార్టీపై ఆంధ్ర ముద్ర వేసి లబ్ధి పొందిన కేసీఆర్ నేడు మరల తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని తెలంగాణ ప్రజానీకం ఖండించాలన్నారు. తెలంగాణ అభివృద్ధిలో , తెలంగాణ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు పాత్రను ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలన్నారు. గూట్లో రాయి తీయలేనోడు ఎట్లో రాయి తీస్తానన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందన్నారు. తెలంగాణను నిండా ముంచిన కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో దేశాలు తిరుగుతున్నాడని, తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు పై తప్పుడు ప్రచారాలు చేయటం కెసిఆర్ కు , ఆ పార్టీ నాయకులకు తగదన్నారు. చంద్రబాబు నాయుడు పై తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ కొమ్మగని వెంకటేశ్వర్లు గౌడ్ మఠంపల్లి మండల పార్టీ కన్వీనర్ మాలోతు నాగునాయక్, గుండు వెంకటేశ్వర్లు, కంకరతన్యం తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin