సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజలు అంబలి అన్నగా పిలుస్తున్నారని ఇది విని చాలా సంతోషంగా ఉందని ట్రస్ట్ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు, మహిళల ఆదరణ పెరిగి అంబలన్న పేరుతో ప్రతి గ్రామంలో మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. విష్ణన్న రాఖీ రక్ష కార్యక్రమంలొ భాగంగా 8వ రోజు రాంచంద్రాపూర్, మహాదేవ్ పూర్, భైరంపల్లి, ఉత్తరాసిపల్లి, టేకులపల్లి, ముట్పూర్, రెగడి చిల్కమర్రి, గ్రామాలలో,రెండు వేల ఆరు వందల పై చిలుకు చీరలు విష్ణు వర్ధన్ రెడ్డి మహిళలకు అందించడం జరిగింది. వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు విష్ణు వర్ధన్ రెడ్డిని అంబల్లన్న గా పిలుస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. అదే విదంగా మహిళలకు అండగా ఉంటామని అన్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజక వర్గం లోని ఏ గ్రామానికి వెళ్లిన అంబలన్నగా పిలుస్తుండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అన్నా చెల్లెలు, అక్కా తముళ్ల బంధం ఎంతో విలువలతో కూడుకున్నదని ఇవి కొన్ని కారణాల వల్ల దూరం అవుతున్నాయని అన్నారు. అవన్నీ పక్కనపెట్టి రాఖీ కానుక అందుకున్న అక్కా చెల్లెళ్ళు రాఖీ పండుగను మీ అన్నా తమ్ముళ్ల కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమరబండ శ్రీశైలం, శ్యామ్ సుందర్ రెడ్డి, ఆకుల ప్రదీప్, బోయ అశోక్, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భూపతి రెడ్డి, వీరేష్, ప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్, విజయ్, రవి, మల్లేష్, యాదయ్య, నర్సిములు, కృష్ణా రెడ్డి, ప్రవీణ్, మల్లేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin