సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలోని వెంకటాపురం పంచాయతీ పాలనేనివారిపల్లి గ్రామ సమీపంలో గుట్టపై వె టీవిలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో శుక్రవారం ఘనంగా బోనలా జాతర నిర్వహించిన్నట్లు ఆలయ నిర్వాహకులు పి. శ్రీనివాసులునాయుడు, పి.గంగినాయుడు,అదెప్పనాయుడు,వల్లపు హరీష్ తదితర సభ్యులు తెలిపారు.ప్రతి యేటా వైశాఖ మాసంలో మొదటి శుక్రవారం శ్రీ సప్త అక్కదేవతల ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో ప్రతి ఇంటి నుండి మహిళలు ఎలవగంపలో పసుపు,కుంకుమ,ధాన్యాలతో పూజలు నిర్వహించి గురువయ్యల ప్రత్యేక వాయిద్యాలతో ఊరేంగింపుగా భోనాలతో ఆలయం వద్ద చేరుకొని అక్కదేవతలకు నూతన వస్త్రాలు సమర్పించారన్నారు.అనంతరం జాతరలో ప్రత్యేకంగా పదేళ్ల వయసు గల ఏడుగురు బాలికలకు పూలహారాలతో అలంకరణ చేసి,ఆలయంలో అక్కదేవతలకు గీతాలు ఆలపిస్తూ దీపధూప, నైవేద్యం సమర్పించి, మహామంగళహారతి నీరాజనాలతో దర్శనం చేయించగా,భక్తులు మొక్కుబడి తీర్చుకొన్నారన్నారు. పరిసర గ్రామాల నుండి వందలాది మంది దర్శనం కోసం విచ్చేసిన గ్రామస్తులకు,భక్తులకు అన్నదానం, తాగునీరు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.....
-----------------------
Admin