సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం వైద్యులు , ఆస్పత్రి సిబ్బంది , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమన్వయ మరియు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, వారికి తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బిపి షుగర్ పేషెంట్లకు జీవనశైలి విధానంపై అవగాహన కల్పించాలని, సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి ఆస్పత్రులను మూసివేస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పెండెం వెంకటరమణ, అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ జయ శ్యాంసుందర్ , డాక్టర్ నజియా , ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కరుణ్ , డాక్టర్ మీసా ప్రవీణ్ కుమార్, డాక్టర్ రవి , డాక్టర్ రజని ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin