సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్రమంత్రి దేవుసిన్హ్ జెసింగ్భాయ్ చౌహాన్ కి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల సమస్యలను వివరిస్తూ గత 65 సంవత్సరాలుగా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితా నుంచి తొలగించబడిందని గిరిజన జాతి మూల పురుషులు వాల్మీకి బోయాలని , జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను గౌరవ నరేంద్ర మోడీ అధ్యక్షతన తిరిగి వాల్మీకి బోయలు ST పునరుద్దరణ కార్యక్రమం చేపట్టాలని నరేంద్ర మోడీ కర్నూలు సాక్షిగా మాకు హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు ప్రస్తుతం వాల్మీకి బోయలు బీసీ సామాజి వర్గంలో ఉండి విద్య, ఆర్థిక రాజకీయంగా అన్ని విధాల వెనుకబడి ఉన్నారని వలసలు వెళ్లి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రోడ్లు ఊడ్చుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారని దేశంలో ఎక్కడ లేని విధంగా విభజన జరిగిందని ప్రాంతీయ వ్యాత్యాసాలు తొలగించాలని కృష్ణమూర్తి కోరారు జిల్లా యూత్ అధ్యక్షుడు ధనుంజయ వివరిస్తూ మా జిల్లాలోనే ముఖ్యంగా కర్ణాటక బార్డర్ అయిన మడకశిర, ఆదోని తదితర ప్రాంతాల నుంచి కర్ణాటక నందు మా వాల్మీకి సోదరులు సోదరీమణులు ఇచ్చిపుచ్చి వివాహాలు చేసుకున్నారని ఇతర రాష్ట్రాలలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఎస్టీలుగా కొనసాగుతున్నారని భారత రాజ్యాంగంలో ఉన్న సమన్యాయ పాలన అమలు కావడం లేదని ఇది వాల్మీకి బోయ జాతి యువకులకు వివరించారు మీరు వాల్మీకి బోయ జాతిని ST పునరుద్ధరణ చేస్తే 40 లక్షల మంది వాల్మీకి బోయలు మీ వెంట ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ,శ్రీ సత్య జిల్లా యూత్ అధ్యక్షుడు ధనుంజయ , జిల్లా నాయకులు సుదర్శన్ , కదిరి హరి , నల్లమాడ రవీంద్ర , సాయి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin