Saturday, 13 June 2026 12:49:39 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తెలంగాణలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతోంది... -టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

Date : 29 May 2023 12:14 AM Views : 514

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల పరిధిలోని బేర్ ఖాన్ పల్లి గ్రామం లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్, రూప్ల నాయక్ రాఘవేందర్, అంజయ్య, యాదయ్య, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయన్నారు ఈ బేర్ ఖాన్ పల్లి గ్రామంలో మాల మాదిగాల కుటుంబం నుంచి భూములను దౌర్జన్యంగా అక్రమంగా లాక్కున్నారని, పేదల ప్రజల సంక్షేమ పథకాలు గ్రామ అభివృద్ధి చేయకపోగా అమాయక ప్రజలపై కేసులు పెడుతున్నారన్నారు తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం బేర్ ఖాన్ పల్లి లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గత కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్దే తప్ప ఈ తొమ్మిదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు ఆసరాగా ఉండే పథకం ఆ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దౌర్జన్యంగా బెదిరించి అరాచకాలు సృష్టించి కేసులు పెట్టి మా కార్యకర్తలకు కండువాలు కప్పుతున్నారు కండువాలు మీవి, ఓట్లు మావి రాబోయే ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బేర్ ఖాన్ పల్లి, మాజీ సర్పంచ్ రూప్ల నాయక్ మాట్లాడుతూ.. గ్రామంలో అధికార దాహంతో దౌర్జన్యాలకు పాలు పడుతున్నారని, బెదిరించి అరాచకాలు సృష్టిస్తూ మా పార్టీలో చేరితే తప్ప మీ గ్రామ అభివృద్ధి జరగదు అని మా పార్టీ నాయకులను కార్యకర్తను బిఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారన్నారు. మా గ్రామము షాద్ నగర్ నియోజకవర్గం జాబితాలో ఉందా లేక వేరే రాష్ట్రంలో ఉందా మాకు అర్థం కావడంలేదన్నారు పార్టీకి అభివృద్ధికి సంబంధం అంట కట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అన్నారు రూప్ల నాయక్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పి, కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు వి గణేష్ గ్రామ ఉపసర్పంచ్ గుండ్డగల మాణెమ్మ, అంజయ్య, గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :