సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు ఎంపీడీవో పోలప్ప అల్లాపల్లి గ్రామ సచివాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రిజిస్టర్లను పరిశీలించిన ఆయన సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు .ఏ ఏ సమస్యలు ఎక్కువగా సచివాలయానికి వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సచివాలయంలో అందాల్సిన సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలను పరిశీలించారు...
-----------------------
Admin