సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు ప్రభుత్వ పథకాలు జనవరి 26 నుంచి అమలు చేస్తామని మిర్యాలగూడ ఎమ్మార్వో హరిబాబు తెలిపారు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్స్ 75,500 వచ్చినాయి వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారు ఎంపిక జరుగుతుంది మొదటి విడత లో వికలాంగులకు ప్రాథమిక ఉంటుంది అని తెలిపారు అలాగే రేషన్ కార్డులు కూడా గ్రామ సభ ద్వారా ఎన్నిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు నియోజకవర్గంలో 10300 మంది అప్లై చేసుకున్నారని హరిబాబు తెలిపారు ఆత్మీయ భరోసా కింద పనికి ఆహారం పథకం కింద జాబ్ కార్డు ఉండి 20 రోజులు పని చేసిన వాళ్ళు వ్యవసాయ భూము లేని వాళ్ళు అర్హతలుగా భావిస్తారు రైతు భరోసా అగ్రికల్చర్ ఆఫీసర్ రెవిన్యూ ఆఫీసర్ ఇద్దరు కలిసి గ్రామాలలో తిరిగి ఎంక్వయిరీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎమ్మార్వో పుష్పలత , మిర్యాలగూడ ఎంపీడీవో శేషగిరి శర్మ మాడుగుల పల్లి ఎమ్మార్వో సురేష్ కుమార్, దామరచర్ల ఎమ్మార్వో జోహార్ బాబు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఆర్ ఐ శ్యాంసుందర్, రామకృష్ణ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin