సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో రెడ్డి పరివార్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గాయం రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి గా మిర్యాల పుల్లారెడ్డి ని నియామకం చేశారు.గౌరవ సలదారులు గాయం చంద్రారెడ్డి, మోదుగు రాంరెడ్డి, ఎలక అప్పిరెడ్డి, గాయం మన్మథరెడ్డి,తాటికొండ వెంకట రెడ్డి ఉపాధ్యక్షులుగా నామిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాగిరెడ్డి మోహన్ రెడ్డి, పశ్య రవిందర్ రెడ్డి, కొండేటి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారిగా మన్నెం సీతారాంరెడ్డి లు ఎన్నికయ్యారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కమ్యూనిటి పంక్షన్ హాల్ తో బాటు నిరుపేద కుటుంబాల విద్యార్థులకు విద్య కు తమవంతు సహాయం చేయడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మన్నెం శేషిరెడ్డి, మన్నెం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin