సర్కార్ టీవీ న్యూస్ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా లో 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, Kangti నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సిఇసి , హెచ్ఇసి గ్రూపులలో ప్రవేశము కొరకు 2024-25 విద్యా సంవత్సరము పదవ తరగతి లో ఉత్తీర్ణత పొందిన బాలురకు తేదీ.09.06.2025 ఉదయం 11.00 గంటలకు(గురుకుల కళాశాల) TGTWURJC BOYS Kangti గల పాఠశాల/కళాశాల లో కౌన్సిలింగ్ నిర్వహించబడును. అట్టి కౌన్సిలింగ్ కు హాజరగు విద్యార్థులు 1.బదిలీ ధృవీకరణ పత్రము. 2. పదవ తరగతిలో సాధించిన మార్కుల మెమో (2024-25), 3. స్టడీ మరియు కండక్ట్ సర్టిఫికేట్. 4. కుల ధృవీకరణ పత్రము, 5. ఆదాయ ధృవీకరణ పత్రము (2025-26, గ్రామీణ ప్రాంతమునకు సంబంధించిన వారు రూ.1,50,000/-మరియు పట్టణ ప్రాంతమునకు సంబంధించిన వారు రూ.2,00,000/- కు మించరాదు). 6. ఆధార్ జిరాక్స్ మరియు స్పోర్ట్స్, అర్ఫాన్, PHC ధృవీకరణ పత్రములు, 3 కలర్ ఫోటోలు, రెండు జతల నకలు కాపీలుతో హాజరు కాగలరని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పాఠశాల/కళాశాల , Kangti ప్రిన్సిపల్ శ్రీ డి.విజయ్ గారు తెలిపారు. కాబట్టి సిఇసి, హెచ్ఇసి గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్ల యందు ప్రవేశం పొందగోరే బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇట్లు: ప్రిన్సిపాల్ D. విజయ్ 8500481205
-----------------------
Admin