సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవరచెరువు మండల పోలీస్ స్టేషన్ ను డి.ఎస్.పి వాసుదేవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు .సోమవారం పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గోపి, పోలీసు సిబ్బంది మరియు మహిళా పోలీసులకు డిఎస్పి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం డిఎస్పి మాట్లాడుతూ ఓబులదేవరచెరువు పోలీస్ స్టేషన్లను, వాటి పరిదిలో ఏర్పాటు చేసిన అంతర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నిఘా ఉంచాలి. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించాడు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్లో సీజ్ చేయబడిన వాహనాలను, లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీచేసి స్టేషన్ పరిధిలోని మెన్ పర్టిక్యులర్స్ అడిగి తెలుసకున్నారు. విద్యార్ధుల కు మాదకద్ర్యాలు , జూదం మొదలైన వాటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలి కళాశాలల పై నిఘా ఉంచాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ పరిది లో పెండింగ్ కేసులను తగ్గించాలి అని, మట్కా గాంబ్లింగ్, ఇసుక అక్రమ రవాణా పై దృష్టి సారించి నిఘా పెంచాలని, సిబ్బంది నీ పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని తెలియజేశారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ లను అమలుపరచాలని చేయాలని తెలియజేశారు.స్టేషన్ పరిధిలో క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, చెక్పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించి ఇతర రాష్ట్రాల్లో నుంచి ఇతర రాష్ట్రాల మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అక్రమ మద్యం, పూర్తిస్థాయిలో అరికట్టాలని తెలియజేశారు. అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టు లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
-----------------------
Admin