సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నేరేడుచర్ల మున్సిపాలిటీ కేంద్రం నందు బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీసి లోన్ లలో అన్ని అధికార పార్టీ నాయకులకే కేటాయించడం విషయమై మున్సిపాలిటీ కేంద్రం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు .ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ బీసీ లకు ఇచ్చే లక్షలో కూడా వివక్ష ఎందుకు అని, బీసీలను బి.ఆర్.యస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని అర్హులైన నిరుపేద కులవృతులు చేసుకునే వారికి ఇవ్వకుండా మొత్తానికి మొత్తం బి.ఆర్.యస్ పార్టీ నాయకులకు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు బీసీ బంధు, దళిత బంధు పథకాలతో ప్రజలను మోసం చేయొద్దు అని వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందంచి అర్హులైన వారికి కేటాయించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి కొండమిది నర్సింహా రావు,నియోజకవర్గ ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి,మండల అధ్యక్షులు తకెళ్ళ నాగార్జున, అమరవరపు వెంకటేశ్వర్లు, గోవర్ధన్ యాదవ్, నవీన్ కుమార్, సోషల్ మీడియా విరాంజనేయులు, స్వరూప్ రావు,బొజ్జా పవన్ కుమార్, సిరికొండ విజయలక్ష్మి, నకిరేకంటి మౌనిక, వంగోజు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin