సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలంలో కొందరు దళారులు ఇటుకల బట్టిలు అనుమతులు లేకుండా ఏర్పర్చి లేబర్ చట్టాలను తుంగలో తొక్కుందే కాక ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్ ను కూడా లెక్కచేయకుండా చట్టాలకు విరుద్ధంగా నడుస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులుకు పాల్పడుతున్నారు. దమ్మపేట మండలంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఇటుకలు బట్టీలు పై సంబంధిత అధికారులు వారి వంక చూడకపోవటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి సంబంధిత అధికారులు ఇకనైనా చట్టపరమైన చర్యలు తీసుకొని అనుమతులు లేని ఇటుకు బట్టి యజమానియాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏజెన్సీ ఏరియాలో 170 యాక్టు విరుద్ధంగా ఏజెన్సీ భూములను లీజుకు తీసుకొని వాటి నుండి అక్రమంగా మట్టిని తోలుతూ తోలుతూ గుట్టలు పేర్చుకొని నిల్వలో ఉంచుతున్నారు దీని పై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని గండి కొట్టకుండా ఇకనైనా మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఇటుకల బట్టిలలో చేసే కార్మికులకు లేబరు అనుమతులు ఉన్నాయా అంటే నా వద్ద అవేమీ ఉండవు నన్ను అడిగే వారు లేరంటూ జవాబు ఇచ్చారు ఇకనైనా లేబర్ అధికారులు స్పందించి లేబర్ అనుమతులు లేని ఇటికలు బట్టీలపై చట్టపరిమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఇటుకల బట్టీలు జాతీయ రహదారుల పక్కనే ఏర్పరిచి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఆ ఇటుకల కాల్చేటప్పుడు వచ్చే పొగ వాహనదారుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారనీ ప్రజలు వాపోతున్నారు ఈ విషయంపై దమ్మపేట తాసిల్దారును వివరణ కోరగా మనించు ఎటువంటి అనుమతులు జరగలేదు అన్నారు. ఈ విషయంపై ఆ గ్రామమైన మందలపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి వివరణ కోరగా మా పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు మేము ఇవ్వలేదు తెలపడం జరిగినది. ఈ విషయంపై ఇటుకల బట్టీల చుట్టుపక్కన ప్రాంతాల ప్రజలు రాష్ట్ర జాతీయ రహదారిపై ఆందోళన చేపడుతామని హెచ్చరించడం జరిగినది...
-----------------------
Admin