సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్కూళ్లలో, కాలేజీలలో 1 నుండీ 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయించాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు అన్నీ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో, అంగన్వాడి తెలియజేశారు. ఒక్కటి నుండి రెండు సంవత్సరముల మధ్య పిల్లలకు ఆల్బెండజోల్ ఆఫ్ టాబ్లెట్ ను క్రష్ చేసి స్పూన్ ద్వారా పిల్లలకి వేయాలని తెలియజేశారు. మూడు నుండి ఐదు సంవత్సరముల పిల్లలకి నమిలించి మ్రింగించాలని తెలియజెప్పారు. అలాగే ఆరు నుండి 19 సంవత్సరాల పిల్లలు అందరికి కూడా నమిలి మింగించాలని, ఈ టాబ్లెట్ భోజనం చేసిన తర్వాత ముగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఆయా గ్రామాలలో ఉన్న సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు పట్టణంలో మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రారంభించాలని తెలిపారు. ఈ జాతీయ నులిపురుగుల నివారణ ప్రోగ్రాంలో షాద్ నగర్ డివిజన్ లో 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు మొత్తం 79,240 మందికి రేపు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయనున్నట్లు డాక్టర్ జయలక్ష్మి తెలియ జేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, ఫరూక్ నగర్ మండలంలో రేపు నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా, ఫరూఖ్ నగర్ మండలంలోని 17, 710 బాలురులకు, 16,650 బాలికలకు మొత్తం విద్యార్థులు 34, 360 మంది పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయనున్నట్లు తెలియజేశారు. ఈ మాత్రలు భోజనం అనంతరము వేయాలని చెప్పారు. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ల ప్రోగ్రామును అందరు తల్లిదండ్రులు వారి పిల్లలకి అందరూ మింగేటట్లుగా చూడాలని ఈ ప్రోగ్రామ్ అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. విద్యార్థులలో ఎవరికైతే జ్వరము లేదా కండ్ల కలక ఉన్న వారికి ఆల్బెండజోల్ టాబ్లెట్లు మాత్రలు మింగించకూడదని చెప్పారు. వారికి జ్వరం, కండ్ల కలక తగ్గిన తర్వాత మాప్ అప్ డే 10 వ తారీకు ఆగస్టు రోజున మింగించాలని తెలియజేశారు.
-----------------------
Admin