సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా పథకాన్ని అమలుపరచుటకు వాటి విధివిధానాలపై రైతుల నుండి తన అభిప్రాయాన్ని సేకరించుటకు గాను మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల రైతులు పాల్గొని మాట్లాడుతూ పేద మధ్యతరగతి రైతులకు సమన్యాయం జరగాలంటే 5 నుండి 10 ఎకరాలకు రైతు భరోసాని అందించాలని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మరికొంత మంది రైతులు రైతు కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో... మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, డిసిఇఓ-అసిస్టెంట్ రిజిస్టర్ బి. అంజయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ బాణోత్ బాబు నాయక్, డిసిసిబి డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు, సహకార సంఘ కార్యదర్శి బత్తుల తిరుపతయ్య, ఏఈఓ లు భవన్, శ్రావ్య, మాజీ ఎంపీపీ సాముల శివారెడ్డి, మాజీ జడ్పిటిసి సింగారపు అరుణ సైదులు, మాజీ ఎంపీటీసీ ప్రభుదాసు, డైరెక్టర్లు కుర్రే రామ నరసయ్య, వల్లపు దాసు లింగయ్య, పశ్య రామనరసమ్మ మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin