సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరంలోని జాతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రములు ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉపయోగించుకొని ప్రజలందరూ శాంతి సౌబ్రాతృ త్వాలతో జీవిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్ రావు శ్యామ్ రాథోడ్ రుద్ర ప్రదీప్ మంద సరస్వతి అనిత దేవకి వాసు రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin