సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గరిడేపల్లి ఎస్సై వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గానుగబండ, అప్పన్నపేట గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎస్సై పాల్గొని విగ్నేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు .ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్నీ శుభాలకు,కార్యాలకు ఆరంభ సూచికైన ఆరాధ్య దైవమైన అది దైవం గణనాధుడి దీవెనలతో పాడి పంటలు,ప్రకృతి మరింత అభివృద్ధి మరియు శుభకారంగా ఉండాలని ఆయన అన్నారు.గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మండపాల నిర్వాహకులు పూర్తి బాధ్యత వహిస్తూ ఎలాంటి అగైత్యాలు తగాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని శాంతియుత వాతావరణం లో భక్తిశ్రద్ధలతో పోలీసుల ఆదేశాలను పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలలను నిర్వహించుకొని భక్తిశ్రద్ధలను చాటుకోవాలని ఆదేశించారు
-----------------------
Admin