Friday, 31 July 2026 04:42:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ నియోజకవర్గం బి ఎస్ పి పార్టీ అసెంబ్లీ ఇంచార్జి గా వడ్డే మల్లేష్...

Date : 22 September 2023 03:03 AM Views : 208

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలమేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బి ఎస్ పి అసెంబ్లీ ఇంచార్జి గా వడ్డే మల్లేష్ ను నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులు స్క్వేరో లింగం మరియు దొడ్డి శ్రీనివాస్. ఈ సందర్బంగా షాద్ నగర్ లోని బి ఎస్ ఆర్ పార్టీ కార్యాలయం లో వడ్డే మల్లేష్ అధ్యర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశం లోని ఏ పార్టీ కూడా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం లో ఉన్న హక్కులను అమలు చేయడం లేదని అన్నారు. దేశం లో 53 శాతం ఉన్న ఎస్ సి, ఎస్ టీ, బి సి, మైనారిటీ లను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని అన్నారు. బహుజనులకు 60 నుండి 70 సీట్లు ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్బంగా నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జి గా ఎన్నికైన వడ్డే మల్లేష్ మాట్లాడుతూ.. ఇంతకుముందు బహుజన రాజ్యం పార్టీ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బడుగు బలహీన వర్గాల కొరకు చేస్తున్న పోరాటాలకు ఆకర్షతుడినై ఈ పార్టీ లో చేరడమైనది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గం లోని అన్ని మండలాలు, గ్రామాలలో తిరిగి బి ఎస్ పి పార్టీ చేస్తున్న ప్రణాళిక లను తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో బి ఎస్ పి జిల్లా కోశాధికారి రాంప్రసాద్ గౌడ్, జిల్లా ఇంచార్జి గుండేటి మహేష్ చారి, నియోజకవర్గం ఇంచార్జి లు గుండేటి నర్సిములు, ప్రశాంత్ ముదిరాజ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు మోజెస్, కొందుర్గు మండలం అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, భానురి చెంద్రయ్య, సీనియర్ నాయకులు పొట్ట నర్సింలు, ఫరూఖ్ నగర్ మండలం అధ్యక్షుడు తుప్పరి కుమార్, అసెంబ్లీ కన్వినర్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :