సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణా రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని నారాయణపేట జిల్లా, మక్తల్ మండల పరిధిలో గల కర్ని గ్రామంలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా ఎస్, ఐ పర్వతాలు మాట్లాడుతూ, నారాయణా పేట జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 30 తారికున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వర్గ బేధాలు లేకుండా అల్లర్లు జరగకుండా ఎవరు భయ భయభ్రాంతులకు గురికాకుండా శాంతియుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకావాలని తెలియజేశారు. ప్రజలలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా మక్తల్ పోలీస్ వారు కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు
-----------------------
Admin