సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వీర్లపల్లి శంకర్ ను ఎమ్మెల్యే చేసే వరకు తమ ప్రచారం ఆగబోదని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని తాళ్లగూడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసి శ్యామ్ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్, దంగు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కసారి ఆలోచించండి అమ్మ మనకు మోసం చేసిన కేసీఆర్ కు ఓటేద్దామ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వేద్దామా పెద్దమ్మ ఈ దుర్మార్గమైన కేసీఆర్ పాలనను అంతం చేసి మన షాద్ నగర్ నియోజకవర్గ అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.. ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తాళ్లగూడ ప్రజలందరికీ ఒకటే మాట తల్లి గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మంచి చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని అందిస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ, తల్లి, అందరూ ఒక్కసారి ఆలోచించండి నా సోదరుడు శంకర్ న్యాయం ధర్మం ఉన్న వ్యక్తి, ఇప్పటివరకు మస్తు మొసపోయినము మనం ఒక ఉద్యోగం ఇయ్యాకపై, రుణమాఫీ ఇయ్యాకపై, డబల్ బెడ్రూం ఇల్లు ఇయ్యాకపై, ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి మోసం చేసిన పార్టీ బిఅరెస్ కు బుద్ది చెప్పే సమయం వచ్చింది తల్లి, బిఅరెస్ ప్రభుత్వం చేసింది ఒక్కటే భూములు గుంజుడు, దోపిడీలు చేసుడు, కేసులు పెట్టుడు, దుర్మర్గమైన పాలన జరిగింది ఇన్నిరోజులు మనకు, ఈ కేసీఆర్ మన పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలేదు కానీ మందు తాగి తిరుగుండి అని ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ లు మాత్రం పెట్టిండు తల్లి, ఇగ ఇవన్నీ దుకాణాలు బందు చేయాలంటే ఈసారి మాయమాటలు చెప్పిన బిఅరెస్ ప్రభుత్వాన్ని పాతలంలోకి పంపి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేసి మంచి మెజారిటీతో గెలిపించాలి అని తాళ్లగూడ గ్రామ ప్రజలను కోరారు...
-----------------------
Admin