సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా ఈరోజు బుధవారం నాడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వెంకటాపురం మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వర్గీకరణ వద్దు కలసి ఉంటే ముద్దు మాలల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నిరసన వ్యక్తం తెలియజేశారు అనంతరం మాల మహానాడు అధ్యక్షులు సాధనపల్లి చిట్టిబాబు సీనియర్ నాయకులు కాలువ సుందర్ రావు మాస్టర్ రిటైర్డ్ వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని భారత దేశంలో అన్ని రాష్ట్రాల ఎంపీలతో చర్చించి నిర్ణయం చేయవలసి ఉండగా అలా చేయకుండా ఏడుగురు జడ్జిలతో ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని వారు అన్నారు. ఇలాంటి తీర్పు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్ర ఉందన్నారు రాష్ట్రాలకు వర్గీకరణ చేసే పూర్తి హక్కు ఉందని చెప్పించి రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని. తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణ చేయడంలో మా ప్రభుత్వం ముందుంది అంటున్నారని జనాభా ప్రాతిపాదికన వర్గీకరణకు ముందున్న తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఎస్సీ బీసీ లకు చెందే విధంగా వర్గీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఖ్య ఆదినారాయణ లకుమల్ల మోహన్ రావు మోతుకూరి రాజు యన్నమల్ల రవి గుండమల్ల రమేశ్ యన్నమల్ల రమణయ్య సాధనపల్లి శ్రీనివాస్ శెట్టిపల్లి రమేష్ గూటం రాధాకృష్ణ తోటమల్ల మహేష్ మంచాల సాయి మర్రి చందర్రావు సిహెచ్ లక్ష్మీనారాయణ రావుల నరసింహారావు చిక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin