సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలో సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం శని త్రయోదశి పురస్కరించుకొని నవగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయరామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులకు దోతీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అర్చకులు రఘుపతిరావు, ప్రమోద్, కృష్ణ, సునీల్ పంతులు, భక్తులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పల్లకి సేవలో కౌన్సిలర్ మాధురి నందకిషోర్, పులిమామిడి శ్రీశైలం గౌడ్, తోకల దామోదర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, కొత్తూరు లక్ష్మయ్య, కిషన్ నాయక్, నారాయణ, యామ శ్రీనివాస్, కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, శంకర్ గౌడ్, సుప్ప నర్సింలు, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, వీఆర్వో బచ్చన్న, సత్తయ్య, శ్రీనివాస్, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin