Friday, 31 July 2026 07:48:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలి... -ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్

Date : 12 July 2023 10:02 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొమ్మిదో విడత హరితహారం లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండలంలో ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండా నాయక్ హాజరైన బక్కమంతుల గూడెం, చౌటపల్లి,మఠంపల్లి ,పెదవీడు గ్రామపంచాయతీలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. భావితరాలకు మంచి వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ముఖ్యంగా మొక్కల సంరక్షణ బాధ్యతను గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసుకోవాలని కోరారు. చిన్న మొక్కను మనం బ్రతికి స్తే, అవి పెద్ద చెట్లై మనల్ని బ్రతికిస్తాయి . మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనం పెరుగుతుందని మంచి హాహ్లాద మైన వాతావరణ కలుగుతుంది .మొక్కలు పెంచడం ద్వారా సకాలనికి వర్షాలు కురుస్తాయని, తద్వారా పంటలు బాగా పండుతాయని అన్నారు మొక్కలు నాటడం వలన పర్యావరణ కాలుష్యము కాకుండా చేస్తాయని, వాతావరణం లోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయని, తద్వారా వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగి, మానవుల మనుగడకు, అవసరమైన ఆక్సిజన్ ను చెట్లు అందజేస్తాయి అందుకే మన మంతా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుదాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఎంపీ ఓ ఆంజనేయులు, ఏపీవో ఉమా, బక్కమంతుల గూడెం సర్పంచ్ బేత విజయకుమార్ వెంకటరెడ్డి, పెదవీడు సర్పంచ్ బీబీ కుతుబ్, టెక్నికల్ అసిస్టెంట్ లు, బుంగయ్య, మల్సూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ లు కార్యదర్శులు లక్ష్మణ్ ,వెంకటేశ్వర్లు ,ఉపాధి హామీ సిబ్బంది, మేట్లు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :