సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరం 9వ వార్డులో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ పైశాచికత్వంతో విద్యార్థిని నీ పైపుతో కొట్టాడు.... ఈ సంఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే టీచర్ ... విద్యార్థినీ పై విరుచుకుపడ్డాడు పైపుతో విద్యార్థినికి వాతలు తేలేల కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో రావడంతో టీచర్ పారిపోయి రామవరం లోని ప్రముఖ బి ఆర్ యస్ పార్టీ నాయకురాలు ఇంట్లో దాక్కున్నాడు అని సమాచారం.... తల్లిదండ్రులు వెంబడించి ఆమె ఇంటికి వెల్లి ఇదేమిటి అని అడుగుతే విద్యార్థిని తల్లిదండ్రులను మందలింప చేశాడు. సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించినట్టు సమాచారం... రాజకీయ బెదిరింపులు చేస్తున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుని పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డి ఈ ఓ ను కోరుకుంటున్నారు. మా పిల్లలని విద్య కోసం స్కూలుకి పంపిస్తే హింసకు గురిచేయడం హేయమైన చర్యాని ఇలాంటివి మరలా జరగకుండా బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నట్టు సమాచారం.
-----------------------
Admin