సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజక వర్గంలో ఆర్టిఐ లైవ్ న్యూస్ మరియు పార్టీ నిఘా దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆర్డిఓ సూర్యనారాయణ మరియు టిఎస్పి ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని, నేటి సమాజంలో పత్రిక పాత్ర కీలకమైనది. ప్రజలను చైతన్యవంతం చేసే సమస్యలను వెలికి తీసే వాటిని పరిష్కారం చూపే దిశగా ఆర్టిఐ లైవ్ న్యూస్ మరియు ఆర్టిఐ నిఘా దినపత్రిక ముందుకు సాగాలని, సమాచార హక్కు చట్టంపై మరియు వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పిస్తున్న ఆర్టిఐ కార్యకర్తల కృషి మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఆర్టిఐ యాజమాన్యానికి పత్రిక మిత్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర సహాయ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదాద్రి జోనల్ ఇన్చార్జి వంగవీటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బత్తిని నాగేశ్వరరావు,జిల్లా కోఆర్డినేటర్ గోవింద నవీన్, మాతంగి రవి, ఆర్టిఐ నిఘా రిపోర్టర్లు గోపి, బత్తుల శ్రీను సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin