సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు: శ్రీ శ్రీ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘనాయకులు, జెవివి జిల్లా కార్యదర్శి సామాజిక కార్యకర్త గౌస్ లాజమ్ మాట్లాడుతూ.... కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు,మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు,పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు,జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం అని చెప్పిన మహనీయులు నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగరాజు,వెంకట చలమయ్య రామకృష్ణ,రవి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin