సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లో వివిధ వార్డులకు సంబంధించినటువంటి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయిల వెంకన్న గౌడ్,పాశ్య వెంకటరెడ్డి,పులిచింతల వెంకటరెడ్డి,కుందారపు చంద్రం,జక్కుల శంబయ్య,అయిల సత్యనారాయణ, అయిల అంజయ్య, అయిల కాశయ్య, రాతికింది ధనమ్మ, రాతికింది వీరస్వామి,బంట మల్లేష్, నరసింహారెడ్డి, అయిలా ప్రవీణ్ కుమార్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రంగుల కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయిల వెంకన్న, పాశ్య వెంకటరెడ్డి, పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ నియోజక వర్గం లో ఎమ్మెల్యే అవినీతి పరిపాలన సాగిస్తూ అవినీతి డబ్బు సంపాదన కోసం సొంత పార్టీ నాయకులను, నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడని అతనికి ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియడం లేదని గతంలో నియోజకవర్గం అభివృద్ధి జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారానే మళ్లీ నియోజకవర్గం అవినీతికి తావు లేకుండా అభివృద్ధి పథం లో నడవాలంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైద్దని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియ జేసినారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కాస్తాల శ్రవణ్ కుమార్, వార్డు కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదర్ల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు బంటు సైదులు, లచ్చి మల్ల నాగేశ్వరరావు పట్టణ మైనారిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎస్.కె వద్దండు ఎస్.కె ఫరీద్ పాల్గొన్నారు
-----------------------
Admin