సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకొని విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత ప్రమాధాలకు గురి అవుతున్న సందర్బంగా యువత కు ఉచిత డ్రైవింగ్ లేసెన్స్ తో పాటు ప్రమాధాలకు గురి అయినప్పుడు గాయపడకుండా ఉచితంగా హెల్మెట్ లను పంపిణి చేయడం జరుగుతుంది అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లొ ఉన్న ప్రతి యువతీ యువకులు ఈయొక్క సాధావకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. యువత మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఉచితంగా హెల్మెట్ లను పొందిన వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ బిజెపి నాయకులు విజయ్ బాస్కర్, మోహన్ సింగ్, మండల అధ్యక్షులు పసుల నర్సింహా యాదవ్, వివిధ గ్రామాల భాజపా నాయకులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin