సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శనివారం జిల్లా కోర్టు వెనుకాల ఉన్న షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ, బాలికల వసతి గృహాన్ని న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహం పరిసర ప్రాంతాలతో పాటు సౌచాలయాలను పరిశీలించారు.వసతి గృహం వంటశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలను హాస్టల్ నిర్వాహకురాలు బి. సునీత ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా!అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం తరగతి గదులను,ఫ్యాన్లు, తాగునీరు,ఆహార పదార్దాలు వండేందుకు సిద్ధంగ ఉన్న సరుకులను పరిశీలించారు. వసతి గృహం సౌకర్యాల పట్ల న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. న్యాయమూర్తి తో పాటు కొత్తగూడెం డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, మెండు రాజమల్లు పాల్గొన్నారు.
-----------------------
Admin