సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్, టిపిసిసి మాజీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాం లోనే నియోజకవర్గం అనేక రకాలు గా అభివృద్ధి జరిగిందని జెడ్ ఆర్ యు సి సి మెంబర్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ యరగాని నాగన్న గౌడ్ గుర్తు చేశారు. హుజూర్ నగర్ మండల పరిధిలో గల బూరుగడ్డ, మాచవరం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ ల సభ్యులు రానున్న నెలరోజుల పాటు శక్తి వంచన లేని కృషిచేసి ఉత్తమ్ ను గెలిపించాలని కోరారు. దక్షిణాదిలోనే అతి గొప్ప దేవాలయంగా పిలవబడే బూరుగడ్డ లో వేంచేసిన శాల్మలి కంద వేణుగోపాల ఆది వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని 1 కోటి 45 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 11 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి కరెంట్ కోతలను నీవారించారాని తెలిపారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు అదనపు గదులను నిర్మించారని, గ్రామంలోని సిసి రోడ్లు ఉత్తమ్ హయాంలో వేసినవేనని చెప్పారు. బూరుగడ్డ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ వారినో ఊర్లో తిప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొంది గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారి కోసం అందించే ఆరుగ్యారంటీలను గురించి వివరించారు. హస్తము గుర్తుపై ఓట్లు వేసి ఉత్తమ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ డిసిసిబి డైరెక్టర్ ఈడుపుగంటి సుబ్బారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ టిపిసిసి ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, బాచి మంచి గిరిబాబు ఎంపీటీసీ సందీప్,అదేర్ల శ్రీనివాసరెడ్డి, శివరాం యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మేకపోతుల వెంకయ్య,చేన్నగాని బాలకృష్ణ గౌడ్, బూరుగడ్డ గ్రామ శాఖ అధ్యక్షులు యరగాని బిక్షం, మాచవరం గ్రామ అధ్యక్షులు గడ్డం నాగయ్యయాదవ్, యరగాని గురవయ్య, నరసింహారావు ఎర్రగాని సైదులు , , గడ్డ సత్యం, ఎరగాని వెంకన్న, బత్తిని వీరబాబు చిమట సైదులు, గూడెపు సాంబయ్యతదితరులు ఉ పాల్గొన్నారు.
-----------------------
Admin