సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సత్యమని కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి ఆపలేదని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పోమల్ పల్లి గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా గ్రామస్తులు ఆయా పార్టీలకు చెందిన 40 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అందరికి పార్టీ కండువాలు కప్పి వీర్లపల్లి శంకర్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా కేశంపేట మండలం పోమాలపల్లి గ్రామ యువకులు వివిధ పార్టీల నుండి చేరినట్టు మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ మండల ప్రెసిడెంట్ గూడ వీరేష్, మరియు గ్రామ డిప్యూటీ సర్పంచ్ రమేష్ అధ్యక్షతన టిపిసిసి జనరల్ సెక్రెటరీ షాద్ నగర్ నియోజక వర్గం ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో దాదాపుగా 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామములు వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ అభివృద్ధికి మరియు ఇప్పుడు విడుదల చేసిన ఆరు పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో శంకర్ మీద నమ్మకంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా పనిచేసి అధికారంలోకి తెస్తామని పోమాలపల్లి గ్రామ యువకులు మరియు కార్యకర్తలు చేతులెత్తి కాంగ్రెస్ కు జై కొట్టడం జరిగింది. పార్టీలో చేరిన వారిలో యువకులకు, కార్యకర్తలకు భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం వచ్చిన వెంటనే యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు వ్యాపార రంగాలలో ప్రత్యేక దృష్టి తీసుకుంటామని వీర్లపల్లి శంకర్ హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ కష్టపడి పని చేయాలని యువకులకు మనో ధైర్యం ఇచ్చిన వీర్లపల్లి శంకర్. పార్టీలో చేరినవారు.. మహేష్ యాదవ్, పబ్బే చంద్రయ్య, అన్మగళ్ళ మల్లయ్య, పబ్బె వెంకటయ్య, పబ్బే యాదయ్య, జిన్నారం భరత్, పంపే శ్రీకాంత్, సి వెంకటేష్, పోలే పోగు ఎల్లయ్య, అన్మ గళ్ళ తిరుమలయ్య, జిన్నారం ఎల్లయ్య, శ్రీను ముదిరాజ్, పబ్బె రమేష్, చాకలి సత్తయ్య, చాకలి కృష్ణయ్య జంగయ్య (మాజీ డిప్యూటీ సర్పంచ్), పబ్బి నరేందర్, చాకలి రవి లక్ష్మి చాకలి మల్లేష్, బ్యాగరి రాజు చాకలి కృష్ణయ్య, వెంకటేష్ చల్ల, చాకలి కృష్ణ, అన్మ గళ్ళ శ్రీను, చెన్నకేశవులు, శేఖర్, ఆటో అంజి, సురేష్, జెసిబి కృష్ణ, సి మహేష్, ప్రవీణ్, అన్మ గళ్ళ మధు, గుగ్గిళ్ళ చంద్రయ్య, పెరుమల్ల చెన్నయ్య, చల్ల మల్లేష్, శ్రీనివాస్, తిరుమలయ్య జల్ల ముదిరాజ్, అంజయ్య యాదవ్ తదితరులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు. కేశంపేట్ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, ఎల్గనమొని యాదయ్య యాదవ్, ఐ ఎన్ టి యు సి రఘు నాయక్, ఎల్గణమొని గిరి యాదవ్, పెంటయ్య, కంసాన్పల్లి శేఖర్ ముదిరాజ్, రాయికల్ శ్రీనివాస్, దేవగిరి నవీన్, పురుషోత్తం రెడ్డి, శ్రీధర్, సీతారాం, దేవగిరి అశోక్, నరసింహ, తిగాపూర్ ఆంజనేయులు, లక్ష్మణ్, అనంతం, శ్రీధర్ బాబు, తుమ్మల గోపాల్, ముబారక్, రూపుల నాయక్ తదితరులు.
-----------------------
Admin